ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి. అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్ సహనిర్మాతలు. ప్రభాస్కు జోడీగా దీపికా పదుకోనె నటిస్తున్నారు.అలాగే బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. సుమారు రూ.400 కోట్లతో భారీ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
కాగా,ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ యంగ్ రెబల్ స్టార్ అభిమానుల కోసం ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు.ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్డేట్ను ఇస్తానని తేదీలతో సహా ప్రకటించారు.సంక్రాంతి పండుగ తర్వాత తమ చిత్రానికి సంబంధించి ఓ ప్రత్యేకమైన అప్డేట్ ఇస్తానని నాగ్అశ్విన్ ఈ ఏడాది ఆరంభంలో చెప్పారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో స్పందించిన నాగ్ అశ్విన్..జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న కానీ కచ్చితంగా ఒక అప్డేట్ ఉంటుంది అని సమాధానమిచ్చారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు.